గుంటూరు

భూసేకరణపై రైతులతో గ్రామ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజెండ్ల, ఫిబ్రవరి 13: మండలంలోని చింతలచెర్వు గ్రామంలో బుధవారం గుంటూరు-గుంతకల్ రైలు మార్గంలో భూ సేకరణపై రైతులతో అభిప్రాయ సేకరణ గ్రామ సభను ఐఆర్‌ఇఎస్ జిల్లా ఇనె్వస్టిగేషన్ సూపర్ వైజర్ వి వాసుదేవాచారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా భూసేకరణ వల్ల రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. డబ్లింగ్ పనుల్లో భాగంగా భూములు కోల్పోతున్న రైతుల వివరాలను సేకరించారు. రైల్వే లైను వెళ్తున్న మార్గంలో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు ఎక్కడ అవసరమవుతాయో చెప్పాలని రైతుల వద్ద అర్జీలను స్వీకరించారు. రైతుల వద్ద సేకరించిన పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదిక రూపంలో అందజేయడం జరుగుతుందని వాసుదేవాచారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సుబ్బారావు, సర్వేయర్ హనుమంతరావు, విఆర్‌వో నాగరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.