గుంటూరు

అభివృద్ధిని చూసి మళ్లీ అధికారమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల, ఫిబ్రవరి 21: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు కోరారు. పట్టణంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన అన్న క్యాంటీన్ ప్రారంభించారు. బుగ్గవాగు నుంచి మాచర్ల పట్టణానికి 80 కోట్ల వ్యయంతో చేపట్టే మంచినీటి సరఫరా, 16 కోట్లతో చేపట్టే సిసి రోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధికి గురువారం మంత్రి పత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి సిఎం చంద్రబాబునాయుడు 340 కోట్లు మంజూరు చేశారని, టెండర్లు పిలిచి త్వరలో పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. వరికపూడిసెల ఎత్తిపోతల పథకం నిర్మాణం జరిగితే పల్నాడు ప్రాంతానికి సాగు, తాగునీటి సమస్య తీరుతుందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ అమరావతి అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేక సిఎం చంద్రబాబుపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. ప్రజలు రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలను గమనిస్తున్నారని, అభివృద్ధి నిరోధకులెవరో ప్రజలకు తెలుసని అన్నారు. మాచర్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.