గుంటూరు

భక్తజన కల్పవల్లి శారదాంబకు కుంకుమార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 21: శృంగేరీ నుంచి విచ్చేసిన వేద పండితులు సప్తశతి పారాయణ, మహామంత్ర అనుష్టానం అలాగే వేదరుక్కులు పఠిస్తుండగా నగరం నలుమూలల నుండి వందలాదిగా తరలివచ్చిన సువాసినులు గురువారం నగరంలోని సంపత్‌నగర్ శ్రీ శృంగేరీ శారదాపరమేశ్వరికి విశేష కుంకుమార్చన చేశారు. అమ్మవారి దేవస్థానంలో ఈనెల 19వ తేదీ మంగళవారం నుంచి శారదాపరమేశ్వరి అమ్మవారి 53వ వార్షికోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. మూడవ రోజైన లక్ష్మీవారం నాడు ఉదయం 8 గంటల నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆ దేవస్థాన, శృంగేరీ గుంటూరు ప్రాంత ధర్మాధికారి పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు పర్యవేక్షణలో ప్రారంభించారు. శ్రీ లక్ష్మీగణపతి, బాల, పంచదశి, అరుణ పారాయణలు, నవగ్రహ అనుష్టానాలను వేద పండితులు చేశారు.