గుంటూరు

రెల్లి కులస్తులకు అండగా జనసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 21: ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న రెల్లి కులస్తులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ అన్నారు. గురువారం అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో 26వ డివిజన్ కెవీపీ కాలనీకి చెందిన రెల్లి కులస్తులు చంద్రశేఖర్ సమక్షంలో జనసైన్యంలో కలిశారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజంలో నిరాదరణకు గురైన రెల్లి కులస్తుల సమస్యలపై తమ అధినేత పవన్ చేసిన రాష్టవ్య్రాప్త పోరాటాల ఫలితంగా జీవో 279 రద్దైందన్నారు. సమాన పనికి సమాన వేతనం దక్కేలా జనసేన పార్టీ పోరాడిందని, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రెల్లిలను ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ వారి సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వీరి జీవన ప్రమాణాల్లో మార్పులు రావడం లేదన్నారు. సమాజంలో పారిశుద్ధ్య పనులు చేసేందుకు ఎవరూ ఇష్టపడరని, అటువంటిది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సమాజహితం కోసం వీరు పనిచేస్తున్నారన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక రెల్లిలకు ఉద్యోగ, ఆరోగ్య భద్రతతో పాటు పక్కా నివాస గృహాలు కల్పించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రెల్లి సంఘ నాయకులు సోమి ఉదయకుమార్ మాట్లాడుతూ సమాజంలో ఎటువంటి గుర్తింపులేని తమ వర్గాన్ని పవన్‌కళ్యాణ్ బహిరంగ సభలో తాను రెల్లి కులానికి చెందినవాడినని ప్రకటించడం తమ జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌లు మాదా రాధా, సయ్యద్ బాబు, నేతలు సాంబశివరావు, డాక్టర్ సతీష్, సోమి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం
మంగళగిరి, ఫిబ్రవరి 21: క్రీడల ద్వారా ఐక్యత పెంపొంది మానసిక ఉల్లాసం, ఆరోగ్యం లభిస్తాయని నియోజకవర్గ టీడీపీ పూర్వ ఇన్‌చార్జ్ పోతినేని శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని సీకే విద్యాసంస్థల క్రీడా ప్రాంగణంలో గురువారం బాబాయ్ అబ్బాయ్ యూత్ ఆధ్వర్యాన జిల్లా టెన్నిస్‌బాల్ క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని కోరారు. టీడీపీ చేనేత విభాగం యువ నాయకుడు తిరువీధుల శ్రీనివాసరావు, బీసీ సంక్షేమసంఘం నాయకుడు కుమ్మర క్రాంతికుమార్, నేరెళ్ల మురళి, పరసా రంగనాధ్, తిరువీధుల బాపనయ్య, పారేపల్లి మహేష్, నక్కా రాజశేఖర్, నవీన్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.