గుంటూరు

అమరేశ్వరుని సేవలో దక్షిణ కన్నడ భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 3: దక్షిణ కన్నడ జిల్లా పద్మశాలీయ మహాసభ (ఉడిపి) 16వ వీరభద్ర మహమ్మాయి టెంపుల్స్ అధ్యక్షుడు పురందర్‌ధీశక్తి పర్యవేక్షణలో పద్మశాలీయ సంఘస్తులు శుక్రవారం అమరావతిలోని అమరేశ్వరస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా పురందర్‌ధీశక్తి మాట్లాడుతూ 1500 సంవత్సరాల క్రితం తమ పూర్వికులు అమరావతిలో నివసించారని, నాటి జమిందార్లకు అనుకూలంగా ఉండేవారని, ప్రస్తుతం కాంచీపురం, మధురై, ఉడిపి జిల్లాల్లో స్థిరపడ్డామని తెలిపారు. పూర్వీకుల ఆనవాళ్లు తెలుసుకుని అమరావతికి వచ్చి స్వామివారికి మహారుద్రాభిషేకాన్ని జరిపించుకున్నట్లు తెలిపారు. 50 వేల రూపాయల నగదు అన్నదానానికి, పంచలోహపు ద్వీపపుకుంది, పంచలోహపు పళ్లెమ, తాము సేకరించిన చిల్లరను స్వామివారికి కానుకగా అందించినట్లు తెలిపారు. అలాడే బాలచాముండికా అమ్మవారికి రెండు పట్టుచీరలు, బంగారపు రేకులను సమర్పించారు.