గుంటూరు
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 June 2016
ఈపూరు, జూన్ 17: అప్పుల బాధతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని గుండేపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానిక గ్రామానికి చెందిన దురిశాల వెంకటేశ్వర్లు (60) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మూడు ఎకరాల సొంత పొలంలో మిర్చి, వరి పంటలు పండించాడు. వర్షాభావంతో పంటలు పండకపోవడంతో పెట్టిన పెట్టుబడులకు తోడు గతంలో చేసిన అప్పుల భారంతో మనస్థాపం చెందిన వెంకటేశ్వర్లు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. యజమాని చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.