గుంటూరు

అల్లుడి చేతిలో అత్త హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, జూలై 3: స్థానిక మసీదుమాన్యంలో ఆదివారం జరుగుమల్లి ప్రకాశమ్మ (40) అనే అత్తను అల్లుడు మనీష్ అబ్దుల్ లతీఫ్ షేఠ్ రోకలి బండలో తలపై బలంగా మోదడంతో ఆమె అక్కడి కక్కడే మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండకు చెందిన మృతురాలు ప్రకాశమ్మ భర్త చనిపోగా రెండేళ్ళ నుండి స్ధానిక మసీదు మాన్యంలో కాపురం ఉంటూ కూరగాయలు అమ్ముకుంటుంది. ఈమెకు కుమారులు, కుమార్తె ఉన్నారు. కొడుకు హైదరాబాద్‌లో తాపీ మేస్ర్తీగా పనిచేస్తున్నాడు. కూతురు మనీష్ అబ్ధుల్ అయేషాఎనిమిది సంవత్సరాల క్రితం దొనకొండకు చెందిన మనీష్ అబ్దుల్ లతీఫ్ సేఠ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవల భర్త వేధింపులకు తట్టుకోలేక ఆయేషా కూడా తన ఇద్దరు పిల్లలతో వినుకొండకు వచ్చి తల్లితో ఉంటుంది. ఈ నేపధ్యంలో 15రోజుల క్రితం అల్లుడు వచ్చి భార్యను కాపురానికి పంపించాలని అత్తతో గొడవపడగా ఆయేషా రానని తిరస్కరించింది. దీంతో ఆదివారం లతీఫ్ సేఠ్ మరలా వచ్చి భార్య ఆయేషాతో గొడవ పడి, కత్తితో దాడి చేయగా మృతురాలు అత్త అడ్డుకోగా, పక్కనే ఉన్న రోకలిబండతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తల పగిలి రక్తం మడుగులో అత్త మృతి చెందింది. పట్టణ ఎస్‌ఐ జీవీ నారాయణ సంఘటన స్ధలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అల్లుడు పరారీ అయ్యాడు. సిఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ జీవీ నారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.