గుంటూరు

అనుమానంతో భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూలై 15: అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన ఘటన తెనాలి పట్టణంలో సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం గురువారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇలాఉన్నాయి. పట్టణలోని చినరావూరు పార్కు సమీపంలోని దొనకోటి బాలాజీ (31), భార్య జ్యోతి (25) కృష్ణాజిల్లాకు చెందినవారు. 8 సంవత్సరాల కిందట వీరికి వివాహం జరిగిన తరువాత కూలి పనులు చేసుకొని జీవనం సాగించేందుకు తెనాలి ప్రాంతానికి వచ్చి చినరావూరు పార్కు సమీపంలో ఓగృహంలో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కొంతకాలంగా తాపీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాలాజీ మద్యానికి బానిసై భార్యపై అనుమానాలు పెంచుకుంటూ వచ్చాడు. ఆమెను నిత్యం శారీరికంగా, మానసికంగా వేధిస్తూ వస్తున్నాడు. జ్యోతి తరపు బంధువులు పలుమార్లు బాలజీకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అతనిలో మార్పురాలేదు. గురువారం రాత్రి పొద్దుపోయిన సమయంలో నిద్రిస్తున్న భార్యను రోకలిబండతో తలపై దాడిచేసి హత్యమార్చాడు. అనంతరం తన భార్య జ్యోతిని తానే చంపినట్లు, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్న నేలపై తలలుపులపై రాసి గృహంలోని ఫ్యానుకు చీరతో ఉరేసుకొని మృతి చెందాడు. శుక్రవారం ఉదయం బాలాజీ ఇంటి తలుపులు తెరవకపోవటంతో ఇరుగుపొరుగు అనుమానంతో గృహం తలుపులు తెరిచి సంఘటన చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒన్‌టౌన్ సిఐ బెల్లం శ్రీనివాసరావు సిబ్బందితో సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని ప్రాథమిక సమాచారం అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గృహంలో నేలపై, తలుపుపై బాలాజీ రాసిన రాతలను పరిశీలించారు. తన చావుకు ఎవ్వరూ కారకులు కారని, తన భార్యను తానే చంపినట్లు ఆ రాతల్లో పేర్కొన్నాడని సిఐ తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాసరావు వివరించారు.