గుంటూరు
మతోన్మాద దిష్టిబొమ్మ దగ్ధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 July 2016
వినుకొండ, జూలై 22: దళితులపై దాడులకు నిరసనగా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం శివయ్య స్థూపం సెంటరులో మతోన్మాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పోరాట సమితి నాయకులు పూదాల శ్రీను మాట్లాడుతూ గుజరాత్లో దళిత యువకులపై దాడి, మాయావతిని బిజెపి నేత అవమానించటాన్ని నిరసించారు. గుజరాత్ లోని ఉణ పట్టణంలో చనిపోయిన ఆవుల తోలుతీసి అమ్ముకునేందుకు యువకులు ప్రయత్నిస్తుండగా దానిని సాకుగా తీసుకుని నలుగురు దళిత యువకులను బహిరంగంగా చితకబాదారని ఆరోపించారు. కార్యక్రమంలో అంబేద్కర్, సాగర్ , దావీదు తదితరులు పాల్గొన్నారు.