గుంటూరు

2 లక్షల మంది పుష్కర భక్తులకు అన్నదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 8: రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాల్లో సత్రశాలకు వచ్చే దాదాపు 2 లక్షల మంది పుష్కర భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం రెంటచింతల మండలం సత్రశాలలో నిర్మితమైన పుష్కరఘాట్లను, ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని మాట్లాడుతూ పురాతనమైన సత్రశాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా డ్రోణ్ కెమేరాలతో పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే తెలిపారు.