గుంటూరు

కృష్ణా పుష్కరాలకు మున్సిపల్ పాలక వర్గం దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, ఆగస్టు 12: శుక్రవారం ప్రారంభమైన కృష్ణా పుష్కరాలకు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు దూరంగా ఉన్నారు. సాక్షాత్తూ మున్సిపల్ పరిదిలో జరుగుతున్న పుష్కరాలకు తమకు ఆహ్వానంలేదని, కలెక్టర్ నుండి అందాల్సిన పాస్‌లు తమకు అందలేదని, ఫలితంగా సాక్షాత్తూ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌లను ఉండవల్లిసెంటర్‌లో పోలీసులు సీతానగరం అనుమతించలేదు. పట్టణ ప్రథమ పౌరురాలైన తమ చైర్‌పర్సన్ పట్ల వివక్షత ప్రదర్శించటమే కాకుండా మున్సిపల్ ప్రోటోకాల్ పాటించటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిసింది. శుక్రవారం తాడేపల్లి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఎవరూ లేకుండానే పుష్కరస్నానాలు అధికారులు ప్రారంభించారు. సదరు విషయమై మున్సిపల్ చైర్‌పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మిని వివరణ కోరగా తమ మున్సిపాలిటీ బడ్జెట్ నుండి 2కోట్ల రూపాయలు మంజూరు చేసి సహకరించామని, అయినప్పటికీ ప్రోటోకాల్ పాటించలేదని తెలిపారు.