గుంటూరు
పుష్కర భక్తులతో మంగళాద్రి కిటకిట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 August 2016
మంగళగిరి, ఆగస్టు 21: కృష్ణా పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాలనుంచి తరలిచ్చిన యాత్రికులతో మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ ఎగువ, దిగువ సన్నిధులు ఆదివారం కిటకిటలాడాయి. వేలాదిమంది భక్తులు కొండపై స్వయంభువైన పానకాలస్వామిని బారులుతీరి దర్శించుకున్నారు. దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని, రాజ్యలక్ష్మీ అమ్మవారిని యాత్రికులు దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలి రావడంతో పట్టణ వీధులన్నీ యాత్రికులు, వాహనాలతో కన్పించాయి.