గుంటూరు

భార్య చేతిలో భర్త మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్లపాలెం, అక్టోబర్ 2: భార్య చేతిలో భర్త మృతి చెందిన సంఘటన మండలంలోని బిడారుదిబ్బలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ వెంకట్రావు కథనం ప్రకారం దుండివారిపాలెం పంచాయతీ పరిధిలోని బిడారుదిబ్బలో భార్యాభర్తలు కట్టుపల్లి లోకరాజు (48) భార్య సుజ్ఞానమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా భార్యా భర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు పెరిగాయి. లోకరాజు భార్యను రోకలి బండతో కొట్టబోయాడు. భర్త చేతిలోని రోకలి బండ సుజ్ఞానమ్మ లాక్కొని భర్త తలపై మోదింది. దీంతో భర్త లోకరాజు అక్కడే కుప్పకూలాడు. వెంటనే 108లో బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు జనరల్ ఆసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. లోకరాజు మృతితో బంధువులలో విషాద ఛాయలు అలముకున్నాయి. లోకరాజు, సుజ్ఞానమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి వివాహాలు చేశారు. విషయం తెలుసుకున్న సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వెంకటరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని తమ్ముడు అబ్రహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు.