ఆంధ్రప్రదేశ్
గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై కమిటీ నివేదిక సమర్పణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 19 September 2018
అమరావతి: గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై నియమించిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం ముహుర్త కాలంపై జరిగిన దుష్ప్రచారమేనని వెల్లడించింది. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు ముహుర్త కాలంలో పుష్కర స్నానం ఆచరించేందుకు పోటెత్తటంతో ఈ ఘటన జరిగినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్ను జతచేస్తూ నివేదికను కమిటీ ప్రభుత్వానికి అందజేసింది. కాగా ఈ నివేదికను మంత్రి పితాని సత్యనారాయణ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.