ఆంధ్రప్రదేశ్
తేరుకుంటున్న లంక గ్రామాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 July 2016
కాకినాడ: గోదావరి నదిలో వరద ఉద్ధృతి తగ్గడంతో లంక గ్రామాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వరద నీటి ప్రవాహంతో గత నాలుగురోజులుగా లంక గ్రామాల ప్రజలు భయంతో గడిపారు. శుక్రవారం ఉదయం ధవలేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 11 అడుగులకు తగ్గింది. నీటి ప్రవాహం తగ్గడంతో విలీన మండలాల్లో విద్యుత్ను పునరుద్ధరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ముంపు ఫలితంగా అరటి, బొప్పాయి తోటలకు నష్టం జరిగిందని లంక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. పంట నష్టాన్ని అంచనావేసి తమకు ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు.