జాతీయ వార్తలు

ఆంధ్రకు మూడు సౌర విద్యుత్ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభలో మంత్రి గోయల్ ప్రకటన
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: మూడువేల ఐదు వందల మెగావాట్ల సౌర శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన మూడు సోలార్ విద్యుత్ కేంద్రాలను ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించినట్లు ఇంధన శాఖ మంత్రి పీయూస్ గోయల్ చెప్పారు. అనకాపల్లి తెలుగు దేశం సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాస రావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన లోక్‌సభలో ఈ విషయం తెలియచేశారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో ఈ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని ఆయన చెప్పారు. మూడు వేల ఐదు వందల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తిచేయగల సామర్థ్యంతో ఒక పార్కును దేశంలో ఏర్పాటు చేయటం ఇదే మొదటిసార అని చెప్పారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఆసక్తి చూపిస్తోందంటూ అభినందించారు.