జాతీయ వార్తలు

రాజ్యసభకు జస్టిస్ రంజన్ గొగోయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగియటంతో వారిని నియమించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2018లో సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తన పదవీకాలంలో ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు. గతంలో మాజీ చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా పార్లమెంటు సభ్యునిగా నామినేట్ అయ్యారు. ఆయన తరువాత ఇపుడు జస్టిస్ రంజన్ గొగోయ్‌ను రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.