జాతీయ వార్తలు

పంజాబ్‌లో 10కిలోల బంగారం చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలంధర్‌: పంజాబ్‌లో బంగారంపై రుణాలిచ్చే ఓ సంస్థలో రూ. 3 కోట్లు విలువ చేసే 10 కిలోల బంగారం చోరీకి గురయింది. రామమండి ప్రాంతంలోని సంస్థ కార్యాలయంలో మోటార్‌సైకిళ్లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు సమాచారం. దుండగుల్లో ఓ వ్యక్తి ముందుగా వచ్చి తలుపు తట్టాడు. సెక్యూరిటీ సిబ్బంది తలుపులు తెరిచాక మరో ఐదుగురు భద్రతాసిబ్బందిపై దాడి చేసి, తుపాకీతో బెదిరించి లాకరులో ఉన్న 10కిలోల బంగారం ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దుండగులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.