జాతీయ వార్తలు

ఉద్వేగంలో అలా మాట్లాడాను:కశ్మీర్ గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కార్గిల్‌లోని ఖ్రీ సుల్తాన్ ఛూ స్టేడియంలో లఢక్ టూరిజం ఫెస్టివల్-2019ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అమాయకులను, పీఎస్‌ఓలను, ఎస్‌డీఓలను ఎందుకు చంపుతున్నారు? కశ్మీర్‌ను దోచుకుతింటున్న అవినీతి అధికారులను ఎందుకు అంతం చేయరు అంటూ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నిరసనలు వ్యక్తంకావటంతో తన తప్పును సరిదిద్దుకునేందుకు ఆయన ఉపక్రమించారు. తాను ఉద్వేగంలో అలా మాట్లాడానని, కశ్మీర్‌లో హెచ్చరిల్లుతున్న అవినీతిని తట్టుకోలేక అలా మాట్లాడాల్సి వచ్చిందని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయంగా పరిగణించాలని అన్నారు.