జాతీయ వార్తలు
జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన విధింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 June 2018
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించారు. ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించాలంటూ మంగళవారం గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. గవర్నర్ పాలనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు ఉదయం ఆమోదం తెలిపారు. దీంతో కాశ్మీర్లో నేటి నుంచి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. నిన్నభాజపా ఆకస్మికంగా మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్ముకాశ్మీర్లో ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే.