జాతీయ వార్తలు
జాతికి మోదీ, అమిత్ క్షమాపణ చెప్పాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 April 2016
నైనిటాల్: ఉత్తరాఖండ్లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి పోసిందని మాజీ సిఎం హరీష్ రావత్ (కాంగ్రెస్) అన్నారు. రాష్టప్రతికి తప్పుడు సలహాలిచ్చి ఉత్తరాఖండ్లో రాష్టప్రతి పాలన విధించినందుకు ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా భారత జాతికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చి అన్యాయంగా రాష్టప్రతి పాలన విధించారన్నారు. కాగా, ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ చీలికవర్గం ఎమ్మెల్యేలు ప్రధాని మోదీకి సూచించారు.