జాతీయ వార్తలు

రూ. 1500 కోట్ల కరువు సాయాన్ని కోరాం : హరీష్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : తెలంగాణకు కరువు సాయంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చర్చించారు. వీరిద్దరి మధ్య చర్చ ముగిసిన అనంతరం హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కరువు పరిస్థితుల తీవ్రత దృష్ట్యా రూ. 1500 కోట్ల సాయాన్ని కోరామని తెలిపారు. జాతీయ డెయిరీ పథకం కింద ఇవ్వాల్సిన రూ. 1,024 కోట్లను అడిగామన్నారు. కరువు సాయంపై రేపు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీచ్చారని హరీష్ పేర్కొన్నారు. హరీష్‌రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ ఉన్నారు.