తెలంగాణ

హెచ్‌సియు ఘటనలపై మోదీతో చర్చిస్తా: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హెచ్‌సియులో ఇటీవలి ఘటనలు తనను ఎంతగానో కలిచివేశాయని, ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైతే ప్రధాని మోదీతో, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో తాను మాట్లాడతానని సిఎం కెసిఆర్ శనివారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. హెచ్‌సియు వైస్ చాన్సలర్‌ను రీకాల్ చేయడం తమ పరిధిలో లేదని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. హెచ్‌సియుకు తాను వెళితే మరింత రాజకీయ రాద్ధాంతం జరుగుతుందని, ఈ కారణంగానే అక్కడికి వెళ్లలేదన్నారు. ఉస్మానియా వర్సిటీలో పోలీసులు అతిగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. వర్సిటీల్లో పరిస్థితులను చక్కదిద్దాల్సి ఉందన్నారు.