జాతీయ వార్తలు

గుండెపోటుతో కాంగ్రెస్ నేత వెంకయ్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేలా కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కోరేందుకు ఢిల్లీకి వచ్చిన గుంటూరు జిల్లా కాంగ్రెస్ నాయకుడు వెంకయ్య ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లి వెంకయ్యకు శ్రద్ధాంజలి ఘటించారు. నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఉదయం మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించేందుకు బాపు ఘాట్‌కు వెళ్లారు. అనంతరం వారంతా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఘాట్‌కు శ్రద్ధాంజలి ఘటించేందుకు ముందుకు సాగుతున్న సమయంలో మధ్యలో ఉన్న వెంకయ్య గుండె నొప్పితో అక్కడే కుప్పకూలి పోయారు. ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రమాదాన్ని పసిగట్టి అతన్ని హుటాహుటిన రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరేలోగానే వెంకయ్య మృతి చెందారు.