జాతీయ వార్తలు
ఉత్తర భారతాన్ని ముంచేసిన హిమపాతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 15 November 2018
న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని హిమపాతం కమ్మేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. విపరీతమైన మంచు కురుస్తున్న నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. కాశ్మీర్లో ఏడు జిల్లాల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని రహదారులను మూసివేశారు. హిమపాతం వల్ల ఆపిల్ తోటలు దెబ్బతిన్నాయి.