ఆంధ్రప్రదేశ్‌

హోదా సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప.గో.లో కాంగ్రెస్ మట్టి సత్యాగ్రహం

పోలవరం, డిసెంబర్ 29: మట్టి సత్యాగ్రహం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమేనని ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుండి సేకరించిన లక్ష పిడికెళ్ల మట్టిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపిస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో మట్టి సత్యాగ్రహం కార్యక్రమం నిర్వహించారు. పోలవరంలోని దేవాలయం, చర్చి, మసీదుల నుండి సేకరించిన మట్టి కలశాలకు మంగళవారం ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ అమరావతి శంకుస్థాపనకు నరేంద్ర మోదీ వస్తుంటే ప్రత్యేక హోదాపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని అయిదు కోట్ల ఆంధ్రులు ఎంతో ఆశగా ఎదురు చూశారని, అయితే పిడికెడు మట్టి, పిడతడు నీళ్లు రాష్ట్రానికి ఇచ్చారని ఎద్దేవా చేశారు. విభజన హామీలు అమలయ్యే వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెసు పార్టీ నిలదీస్తుందన్నారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి సంజీవనా అని సిఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని, ప్రత్యేక హోదా వస్తే నిజంగా రాష్ట్రానికి సంజీవని వంటిదేనన్నారు. కేంద్రానికి వచ్చే నిధులలో 90శాతం నిధులు ఉచితంగా వస్తాయని, అలాగే రాష్ట్రానికి పరిశ్రమలు కూడా వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎంఎం పళ్లంరాజు, జెడి శీలం, వట్టి వసంతకుమార్, మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు పాల్గొన్నారు.