ఆంధ్రప్రదేశ్‌

తుని సంఘటనల వెనుక వైకాపా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాపుగర్జన సందర్భంగా జరిగిన విధ్వంసం, దాడుల వెనుక వైకాప హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. కాపులను బిసిలుగా గుర్తించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే రాజకీయంగా ఈ పరిణామాలను సహించలేని వైకాపా కాపుగర్జన సందర్భంగా ఉద్రిక్తత రగిలేలా చర్యలకు పాల్పడిందని టిడిపి ఆరోపించింది. ఎన్టీఆర్ ట్రస్ట్భ్‌వన్‌లో విలేకరుల సమావేశంలో తెదేపా నేతలు డిప్యూటి సిఎం చినరాజప్ప, ఎపిటిడిపి అధ్యక్షుడు కళావెంకటరావు తదితరులు మాట్లాడారు. కాపుఐక్యగర్జన సందర్భంగా విధ్వంసానికి పాల్పడేందుకు వైకాపా ముందుగానే వ్యూహం సిద్ధం చేసిందని వారు ఆరోపించారు. దీనికి తగిన ఆధారాలు ఉన్నాయని, సమయంవచ్చినపుడు అన్నీ నిరూపిస్తామని వారు అన్నారు.
జగన్ హస్తం: యనమల
విజయవాడ- తుని సంఘటనల వెనుక వైకాపా నేత జగన్ హస్తం ఉందని ఏపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాపుగర్జన సందర్భంగా రేగిన ఘర్షణలు, దాడుల వెనుక ఆ పార్టీ హస్తం ఉందని ఆరోపించారు.