తెలంగాణ
శాంతిభద్రతలకు పెద్దపీట:హోంశాఖ మంత్రి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 October 2019
హైదరాబాద్: పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలంగాణ పోలీసు అమరవీరుల సంస్కరణ సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం శాంతిభద్రతలకు పెద్దపీట వేసిందని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. రూ.400 కోట్లతో పోలీస్ కమాండ్ కంట్రోల్ పూర్తిచేశామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డులకు ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అమరులైన పోలీసుల కుటుంబాలను శాఖాపరంగా ఆదుకుంటామని చెప్పారు.