జాతీయ వార్తలు

ముమ్మాటికీ పాక్ పనే పంజాబ్ హోమ్‌మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్, జనవరి 2: ఎయిర్‌ఫోర్స్ బేస్ స్టేషన్‌పై జరిగింది ముమ్మాటికీ పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదుల పనేనని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. ‘మన భూభాగంపై పాకిస్తాన్ ప్రత్యక్షంగా జరిపిన దాడి’ అని హోమ్‌శాఖ బాధ్యతలూ పర్యవేక్షిస్తున్న బాదల్ అన్నారు. ‘ఉగ్రవాదులను తిప్పికొట్టడం ద్వారా భద్రతా దళాలు మనలో ఆత్మస్థయిర్యాన్ని నింపారు’ అని ఆయన చెప్పారు. అంతేకాదు ఇది శత్రువుకు గట్టి హెచ్చరిక కూడా అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పఠాన్‌కోట్ ఘటనపై ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, డిప్యూటీ సిఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో ఉన్నత అధికారులు సమావేశమై పరిస్థితి వివరించారు. కేంద్ర, రాష్ట్ర సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశాన్ని అస్థిరపాలుచేయడం, పంజాబ్ సరిహద్దులో భద్రతను భగ్నం చేయడానికే పఠాన్‌కోట్‌లో దాడికి ప్రయత్నించినట్టు బాదల్ చెప్పారు. ‘మన భద్రతా సిబ్బంది ఉగ్రవాద చర్యను తిప్పికొట్టడం ద్వారా సరైన గుణపాఠం చెప్పారు’ అని ప్రకాశ్ సింగ్ బాదల్ అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతలకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టగల సత్తా ఉందని భారత్ సైన్యం నిరూపించిందని పేర్కొన్నారు. ‘మన సైన్యం, మిగతా భద్రతా సంస్థలు, పంజాబ్ పోలీసులు సమష్టిగా పనిచేసి చొరబాటుదారులకు సరైన బుద్ధి చెప్పారు‘ అని హోమ్‌మంత్రి స్పష్టం చేశారు.