తెలంగాణ

గుర్రం బీభత్సం: ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:సోమవారం ఉదయం పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. అనుభవంలేని ఓ వ్యక్తి గుర్రం స్వారీ చేస్తూ బైక్‌‌ను ఢీ కొట్టాడు. నగర శివారు మైలార్‌దేవ్‌పల్లిలో గుర్రం బీభత్సం సృష్టించింది. గుర్రంపై స్వారీ చేస్తున్న సోహైల్ అనే యువకుడు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడగా, వట్టేపల్లికి చెందిన అమిత్‌షా మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఖాజం తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.