హైదరాబాద్

ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, జనవరి 5: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సరూర్‌నగర్ పరిధిలోని కమలానగర్‌లో నివసించే తుకారంగేట్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన డిటెక్టివ్ ఇనెస్పెక్టర్ అర్జునయ్య కుమార్తె చందన (18) చైతన్యపురిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులందరితో ఎప్పటిలా మెలిగిన చందన భోజనం చేసి పడుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు వారి ఇంటి వైపు వచ్చిన పారిశుద్ధ్య సిబ్బందికి ఇంటిముందు విద్యార్థిని మృతదేహం కనిపించింది. వెంటనే వారు కుటుంబ సభ్యులను లేపి విషయం తెలిపారు. సమాచారం తెలుసుకున్న సరూర్‌నగర్ పొలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అర్జునయ్య కుటుంబం ఆ ఇంటి మొదటి అంతస్తులో నివసిస్తుండగా తెల్లవారుజామున మూడు గంటల తరువాత ఆ ఇంటి రెండవ అంతస్తుకు చేరుకుని చందన తన కళ్లజోడు, స్వెట్టర్ అక్కడపెట్టి పై నుంచి కిందకు దూకి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తలకు తీవ్ర గాయం కావడంతో చందన అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. సరూర్‌నగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.