హైదరాబాద్

తవ్విన కొద్దీ బయటపడుతున్న ‘కళానికేతన్’ ఎండి మోసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: ప్రముఖ వస్తవ్య్రాపార సంస్థ కళానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ లీలాకుమార్ మోసాలు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నాయి. తాజాగా ఆదివారం సిసిఎస్ పోలీసులకు మరో రెండు ఫిర్యాదులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు గుజరాత్, తమిళనాడు, మహరాష్టల్రకు చెందిన పలు బ్యాంకులు, వర్తకులను మోసం చేసినట్టు సిసిఎస్ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 150 కోట్లు ముంచినట్టు నిర్థరణకు వచ్చిందని, షాపుల యజమానులకు అద్దె చెల్లించకుండా వేధింపులకు గురిచేసినట్టు సిసిఎస్ పోలీసులు తెలిపారు. ఓనర్లను హింసించి అక్రమ కేసులు బనాయించాడని పలు ఫిర్యాదులు అందాయని సిసిఎస్ ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటికే 150కోట్ల మోసాలు బయటపడ్డాయని, ఇంకా ఎన్ని మోసాలు వెలుగులోకి వస్తాయోనన్న మీమాంస వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా లీలాకుమార్‌ను సిసిఎస్ పోలీసులు మరో రెండు రోజులు విచారించనున్నట్టు తెలిసింది.