రంగారెడ్డి

హజ్ యాత్ర పేరుతో కోటి రూపాయల వసూలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, సెప్టెంబర్ 6: హాజ్ యాత్రకు పంపిస్తానని సుమారు 50మందిని మొసం చేసిన వ్యిక్తి ఆత్మహత్యా యత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం హుమాయూన్‌నగర్‌కు చెందిన అర్పా ట్రావెల్ సంస్థ యాజమాని నశ్రుత్ అలీ(50). కొంత కాలంగా హాజ్‌కు పంపిస్తానని నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది వద్ద సుమారు కోటి రూపాయలకుపైగా వసూలు చేశాడు. హాజ్‌కు పంపియకపోవడంతో బాధితులు నిలదీశారు. ఈ క్రమంలో సూసైడ్ నోట్ రాసి ఆదివారం ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. బంధువులు గమనించి చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నాడు. హజ్ యాత్ర కోసం 50 మంది వద్ద సుమారు కోటి రూపాయల వరకు తీసుకున్నాడు. హజ్‌కు పంపించే వ్యక్తి తనను మొసం చేశాడని అలీ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అలీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.