హైదరాబాద్

విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యాపారి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఓ వ్యాపారిని మంగళవారం విజిలెన్స్, ట్రాన్స్‌కో అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం, అనంతారం గ్రామానికి చెందిన గౌళికార్ రవీందర్ (40) తన కిరాణ షాపునకు అక్రమంగా విద్యుత్‌ను వాడుకుంటుండగా 2013 మే 31న పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి జరిమానా విధించామని, అదేవిధంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడిన రవీందర్ మరోసారి 2016 సెప్టెంబర్ 24న పట్టుబడగా, అతనిపై రెండోసారి కేసు నమోదు చేశామని విజిలెన్స్ డిఎస్‌పి హైమావతి తెలిపారు. పట్టుబడిన నాటి నుంచి పరారీలో ఉన్న రవీందర్‌ను మంగళవారం అరెస్టు చేసి 21వ, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి జుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్టు డిఎస్‌పి హైమావతి పేర్కొన్నారు.