హైదరాబాద్

ఐదుగురు దొంగల ముఠా సభ్యుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను హైదరాబాద్ ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రెయిన్‌బజార్, కామాటిపుర ప్రాంతాల్లో ఇళ్లల్లో చోరీలు చేస్తున్న మహమ్మద్ మోహదీ, హసన్ బిన్ అఫ్సర్, మహమ్మద్ అలీతోపాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి 40 తులాల బంగారు ఆభరణాలతోపాటు నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ అదనపు డిసిపి ఎన్ కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. పాతబస్తీ తలాబ్‌కట్టకు చెందిన మెహిదీ వాల్ పెయింటర్, కాగా సులువుగా డబ్బు సంపాదించాలని ఆశ పెంచుకున్నాడు. ఇళ్లల్లో చోరీలు చేయాలని పథకం వేశాడు. స్నేహితుడు హసన్ బిన్ అఫ్సర్‌తో పాటు భవానీనగర్‌కు చెందిన ఇద్దరు మైనర్లను వెంట బెట్టుకొని రాత్రి వేళల్లో ఇళ్ల ముందు మైనర్లను కాపలా పెట్టి ఇనుప రాడ్లతో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడుతున్నట్టు డిసిపి తెలిపారు. కమాటిపుర, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదై ఉన్నట్టు చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతోనే వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారని, నిందితులపై పిడి చట్ట ప్రయోగించనున్నట్టు డిసిపి కోటిరెడ్డి తెలిపారు.