హైదరాబాద్

అవినీతి కేసులో డ్రగ్స్ కంట్రోలర్‌కు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: ఓ బ్లడ్ బ్యాంక్ లైసెన్సు రెన్యువల్ చేసేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసి రూ. 50 వేల లంచం తీసుకున్న ఓ అధికారికి సిబిఐ కోర్టు మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 2 లక్షల జరిమానా విధించింది. హైదరాబాద్‌లోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌లో డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్‌గా పనిచేస్తున్న ఎ చంద్రశేఖర్‌రావు ఓ బ్లడ్ బ్యాంకు లైసెన్సు రెన్యువల్‌కు లంచం తీసుకుంటుండగా సిబిఐ 2014 జనవరిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. విచారణ అనంతరం దర్యాప్తు అధికారులు న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సిబిఐ కోర్టు నిందితుడు చంద్రశేఖర్‌రావుకు మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 2 లక్షల జరిమానా విధించింది.