హైదరాబాద్

మండలిలో ప్రశ్నోత్తరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: శాసనమండలి గురువారం నాటి సమావేశాల్లో కూడా ప్రశ్నోత్తరాలు, వ్యవసాయంపై లఘు చర్చ జరిగింది. ఉదయం పది గంటలకు చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఉర్దూ అకాడమీ విభజన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు గడుస్తున్నా, నేటికీ ఎందుకు విభజించలేదని, అందుకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సమాధానం చెప్పాలని కోరారు. దీంతో ఉప ముఖ్యమంత్రి సమాదానం చెబుతుండగా, అందుకు షబ్బీర్ అలీ సంతృప్తి చెందకపోవటంతో భారీ నీటిపారుదల, మార్కెట్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు జోక్యం చేసుకుని అకాడమీ విభజన అంశం రాష్ట్ర పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ పదిలో ఉందని, ఇందుకు కొంత సమయం పట్టే అవకాశాముందని వివరించారు. ఆ తర్వాత సభ్యులు నారదాసు లక్ష్మణ్‌రావు, రాములు నాయక్, డి.రాజేశ్వర్‌రావు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కర్నెప్రభాకర్, డా.పల్లారాజేశ్వర్‌రెడ్డిలు వ్యవసాయ మార్కెట్ సంఘాలలో రిజర్వేషన్లు, రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమ అభివృద్ధి, వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో నగదు రహిత లావాదేవీలు అంశంపై అడిగిన ప్రశ్నలకు మంత్రులు హరీశ్‌రావు, పద్మారావు, పోచారం శ్రీనివాసరెడ్డిలు సమాధానం చెప్పారు. ఆ తర్వాత ‘వ్యవసాయ ఆధునీకరణ, రుణ మాఫీ, పెట్టుబడి రాయితీ చెల్లింపు’ అంశంపై లఘు చర్చను కొనసాగించారు. సభ్యుల ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పగా, అందుకు కాంగ్రెస్ సభ్యులు సంతృప్తి చెందలేదు. రైతులను ఆదుకోవటంతో, వ్యవసాయాన్ని ప్రోత్సహించటంలో ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వటంలో విఫలమైందని, మంత్రి సమాధానం స్పష్టంగా లేదని కాంగ్రెస్ సభ్యులు పి.సుధాకర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడిన తర్వాత చైర్మన్ స్వామిగౌడ్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

ఫ్లెక్సీల నిషేధంతో ఆర్టిస్టుల జీవనోపాధిపై ప్రభావం
ఖైరతాబాద్, డిసెంబర్ 22: తెలంగాణ ప్రభుత్వం ఫ్లెక్సీలను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆర్టిస్టుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలంగాణ ఫ్లెక్స్ ప్రింటర్స్ ఎంప్లారుూస్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు నాగరాజు, వేణుగోపాల్, సుధీర్ మాట్లాడారు. గతంలో ఆర్టిస్టులుగా ఉన్న తాము సాంకేతికత అభివృద్ధి చెందడంతో లక్షల్లో అప్పులు తెచ్చి యంత్రాలను సమకూర్చుకొని జీవనం కొనసాగిస్తున్న సమయంలో ప్రభుత్వ కఠిన నిర్ణయంతో తాము ఉపాధికి దూరం అవుతామని కన్నీరుపెట్టుకున్నారు. మా సమాధులపై బంగారు తెలంగాణాను ఏ విధంగా సాధిస్తారో చెప్పాలన్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా కళానైపుణ్యం కలిగిన తాము స్వయం ఉపాధి పొందుతుండగా దాన్ని సైతం తమకు దూరం చేస్తే బతికేది ఎలా అని ప్రశ్నించారు. ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై సుమారు మూడు లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ విషయంపై పురపాలక మంత్రి కెటిఆర్‌ను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. కళాకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి నిషేధంపై పునరాలోచించాలని కోరారు. పది రోజుల్లో ప్రభుత్వం స్పందించక పోతే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. రవీంద్ర చారి, వాసు, మురళి, రాజు పాల్గొన్నారు.