హైదరాబాద్

బాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్‌కు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: ఒకే నెలలో ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్, ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో విజయకేతనం ఎగురవేసిన బాడ్మింటన్ క్రీడాకారుడు కిదంబి శ్రీకాంత్‌ను గవర్నర్ నరసింహన్ ఘనంగా సత్కరించారు. రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఇది చాలా మంచి సాయంకాలమని, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, జాతీయ కోచ్ గోపీచంద్, ఇతర ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారులు విచ్చేయడం ఆనందంగా ఉందని అన్నారు. రాజ్‌భవన్ వేదికగా రెండేళ్ల కిందట పివి.సింధుని సత్కరించామని, ఇప్పుడు శ్రీకాంత్‌ను సత్కరిస్తున్నామని తెలిపారు. రాజ్‌భవన్ ప్రతి ఏటా సూపర్ బాడ్మింటన్ క్రీడాకారులను చూస్తోందని అన్నారు. గోపీచంద్ ఏర్పాటు చేసిన బాడ్మింటన్ అకాడమీ ఏపి, తెలంగాణల్లో ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసిందని కొనియాడారు. బాడ్మింటన్‌లో ప్రతిభ కనబర్చిన వారంతా అకాడమీలో ఉండి సేవలందించడం ద్వారా హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసేందుకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ, గవర్నర్ నరసింహన్ ఆశీస్సులతో మరిన్ని చాంపియన్‌షిప్‌లను సాధిస్తామని అన్నారు.