హైదరాబాద్

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసగించిన సంస్థపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 19: మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసగించిన సంస్థపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బంజారాహిల్స్‌లో కొంత మంది క్యూనెట్ పేరుతో సంస్థను ఏర్పాటుచేసి మల్టీలెవల్ మార్కెటింగ్ ద్వారా అధికంగా సంపాదించవచ్చునని ప్రచారం చేసుకున్నారు. దీనికి ఆకర్షితులైన నిరుద్యోగుల వద్ద నుంచి సంస్థ అందినకాడికి దండుకుంది. సంస్థలో చేరేముందు చెప్పినట్టు అభివృద్ధి కనిపించక పోవడంతో ఇదేమిటని అడిగిన వారితో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాసాగారు. దీంతో బాధితులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసుతో సంబందం ఉన్న సంస్థ నిర్వాహకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్టు సమాచారం.