హైదరాబాద్

పార్టీ మారి మోసం చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బి కాలనీ, డిసెంబర్ 10: సొంత ప్రయోజనాల కోసమే కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. పార్టీ మారి ప్రజలను మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు అధ్యక్షతన కూకట్‌పల్లి నైనా గార్డెన్స్‌లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యఅతిథిగా బండారు దత్తాత్రేయ విచ్చేసి మాట్లాడుతూ మూడు సంవత్సరాల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి సమయాన్ని కాలయాపన చేశారని అన్నారు. మాధవరం కాంతారావు మాట్లాడుతూ ఎల్లమ్మబండ సర్వే 57లో ప్రభుత్వ భూములను పెద్దఎత్తున కబ్జాలు చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. హస్మత్‌పేట, గోకుల్‌ఫ్లాట్స్, హఫీజ్‌పేట గ్రామ సర్వే నంబర్లలో సైతం గోల్డ్‌స్టోన్ ప్రసాద్ సహకారంతో భూములను ఆక్రమించి పెద్దఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు 26 కులాలను బీసీ జాబితాలో కలిపేందుకు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నానని స్థానిక ప్రజలను నమ్మించి హామీలు నెరవేర్చలేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మాధవరం కాంతారావును దత్తాత్రేయ, సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర బీజేపీ నాయకులు మల్లారెడ్డి, భీమ్‌రావు, హన్మంత రావు, సూర్యప్రకాష్‌రావు, శివరాత్రి దామోదర్, శ్రీకర్ రావు, సత్తిరెడ్డి, విజిత్, శిల్పారెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు.