హైదరాబాద్

సెంట్రల్ యూనివర్శిటీలో భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 22: సెంట్రల్ యూనివర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో సెలవుపై వెళ్లిన విసి అప్పారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించేందుకు వర్సిటీకి రావడంతో మరోమారు ఉద్రిక్తత ఏర్పడింది. అప్పారావును విద్యార్ధులు అడ్డుకుని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.దీంతో యూనివర్శిటీలో ఒక్కసారిగా టెన్షన్ నెలకోంది. విసిని అడ్డుకున్న విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరిగే రోహిత్ సభలో పాల్గొనేందుకు ఢిల్లీ జెఎన్‌యు విద్యార్ధి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ వస్తున్నాడనే వార్తతో పోలీసులు వర్శిటీలో బందోబస్తును పటిష్టం చేశారు. సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.
ఎబివిపి నిరసన : జాతి వ్యతిరేక శక్తులు విసిని అడ్డుకుంటున్నాయని ఎబివిపి నిరసన వ్యక్తం చేసింది. యూనివర్శిటీలో స్వార్ధశక్తులు అలజడి సృష్టించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఏబివిపి తెలంగాణ నేతలు తెలిపారు.