హైదరాబాద్

ఎమ్మెల్యే ‘బస్సు ప్రయాణం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల: ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను, ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్ సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్.. ‘బస్సు ప్రయాణం’ ప్రారంభించారు. కుత్బుల్లాపూర్‌లోని వివేక్ తన నివాసం నుంచి కాలినడకన సాధారణ ప్రయాణికుడిగా బస్టాప్ వరకు వచ్చి 9క్యూ సుభాష్‌నగర్ నుంచి సీబీఎస్ ఆర్డినరీ బస్సును ఎక్కి అసెంబ్లీ వరకు వివేక్ తనతో పాటు పీఏ, ఇద్దరు గన్‌మెన్‌లకు టిక్కెట్‌ను తీసుకున్నారు. బస్సులో కాలేజీ విద్యార్థి లేచి వివేక్‌కు సీటును ఇచ్చాడు. బస్సులో వివేక్ తోటి ప్రయాణికులతో మాట్లాడి రోజూ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధి, పని కోసం బస్సులో వెళ్లే వారితో మాట్లాడారు. రద్దీకి అనుకూలంగా బస్సులు ఉన్నాయా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. బస్సు సకాలంలో గమ్యానికి చేరుకుంటుందా లేదో ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయని కనుక్కున్నారు. ఎక్కువగా ఏ సెంటర్‌లో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని చెప్పారు. స్కూల్ విద్యార్థి, కాలేజీకి బస్సులో వెళ్లిన రోజులను వివేక్ గుర్తుచేసుకున్నారు. బస్సులో ఎమ్మెల్యే, ఎంపీ సీటులో కూర్చుని మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. కళాశాలలకు సెలవులని, సీట్ దొరికిందని లేదంటే ఒంటి కాలితో ప్రయాణించాల్సి వచ్చేదని, అమ్మాయిలకు ఫుట్‌బోర్డ్ చేయాల్సిందేనని వివేక్‌కు విన్నవించారు. పరీక్షలకు ట్రాఫిక్ సమస్యతో చాలా ఆలస్యమవుతుందని విద్యార్థినులు తెలిపారు. బస్సు కండక్టర్‌కు ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృత్తిపరంగా ప్రయాణికులతో ఎలాంటి సమస్యలు లేవని, సర్వీసులను పెంచి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు. అసెంబ్లీ ఆల్ ఇండియా రేడియో బస్టాప్ వద్ద దిగిన ఎమ్మెల్యే వివేక్ శాసనసభ హాల్‌లోకి కాలినడకన చేరుకున్నారు. వివేక్ మాట్లాడుతూ ఎప్పటి నుండో అసెంబ్లీకి బస్సులో వచ్చి సమస్యలను తెలుసుకోవాలని అనుకున్నానని, నేడు సాధ్యమైందని చెప్పారు. నేడు, రేపు కూడా బస్సులో ప్రయాణించి ప్రయాణికుల సమస్యలను, ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్ సమస్యలను తెలుసుకుని అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు.