హైదరాబాద్

ప్రజావాణికి అధికారులు హాజరుకావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్ రావు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హరీష్‌తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని అన్నారు. వచ్చే విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల కేటాయింపులు, పెన్షన్‌లు, భూ సమస్యలు, రుణ మంజూరు, రుణమాఫీ, ఆహార భద్రత కార్డు తదితర అంశాలపై సుమారు 61 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి శోభ, జిల్లా పరిషత్ సీఈఓ రాజేశ్వర్ రెడ్డి, పాల్గొన్నారు.