హైదరాబాద్

ఫ్లైఓవర్ల సుందరీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: మహానగరంలో నిత్యం రద్దీ, ట్రాఫిక్‌తో కన్పించే ప్రధాన కూడళ్లు, ఫ్లై ఓవర్లు ఇకపై రాత్రిపూట ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. దిల్లీ నగరంలో మాదిరిగా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లకు సుందరీకరణ పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. గతంలో సీవోపీ ప్రపంచ సదస్సు జరిగినపుడు, నగరానికి ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక వచ్చినపుడు ముస్తాబు చేసిన మాదిరిగానే శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక సొబగులు సమకూర్చాలని మేయర్ బొంతు రామ్మోహన్ భావిస్తున్నారు. ఇటీవల మేయర్, మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి దిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడ ఫ్లై ఓవర్లు ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిచ్చాయి. నగరంలో కూడా విశాలమైన మెయిన్‌రోడ్లలో ఉన్న ఫ్లై ఓవర్లకు ఈ రకంగా ఎల్‌ఈడీ లైట్లను, ఇరువైపులా, కింద పచ్చదనాన్ని ఏర్పాటుచేస్తే నగరం అదనపు శోభను సంతరించుకుంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ దీపాలతో అలంకరణ, కళాత్మకత ఉట్టిపడే ఆకర్షనీయమై చిత్రలేఖనాలను ఏర్పాటు చేయాలని భావిస్తన్నారు. న్యూ దిల్లీలో మాదిరిగానే సుందరీకరణ పనులు చేపట్టాలని ఇప్పటికే మేయర్ కమిషనర్ జనార్దన్ రెడ్డిని ఆదేశించారు. దీంతో కమిషనర్ జీహెచ్‌ఎంసీలోని ఎలక్ట్రికల్, బయోడైవర్శిటీ, ఇంజనీరింగ్ విభాగాలు సంయుక్తంగా ఫ్లైఓవర్ల సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగా మొదటి దశగా మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్, బషీర్‌బాగ్, పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, తెలుగుతల్లి, సికిందరాబాద్ హరిహరకళాభవన్, సిటీఓ, బేగంపేట ఫ్లైఓవర్లను అందంగా, ఆకర్షనీయంగా తీర్చిదిద్దేందుకు టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టారు. దీంతోపాటు హైటెక్ సిటీ, గచ్చిబౌలీ ఫ్లైఓవర్లను కూడా హెచ్‌ఎండీఏ ద్వారా అందంగా ముస్తాబు చేయాలని నిర్ణయించారు. పలు ఫ్లైఓవర్లకు ఈ సుందరీకరణ పనుల్లో భాగంగా ప్రాథమికంగా పలు పనులను ముమ్మరం చేశారు. తొలుత రంగులు వేయటం, విద్యుత్ దీపాలను ఏర్పాటుకోసం వైరింగ్ ఏర్పాటు చేయటం, ఫ్లైఓవర్ కింద పచ్చదనం ఏర్పాటుచేసే పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నింటినీ మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అధికారులను ఆదేశించారు.

హీరో బాలకృష్ణ ఇల్లు ముట్టడి

* ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలకు బిజెపి, బిజేవైఎం నిరసన
బాలకృష్ణ వాహనాన్ని అడ్డుకుని, ఇంటి గేట్లు దూకే ప్రయత్నం

హైదరాబాద్, ఏప్రిల్ 21: ప్రధాని నరేంద్రమోదీపై సినీ హీరో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిజెపి, బిజేవైఎం కార్యకర్తలు బాలకృష్ణ నివాసాన్ని ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి సుమారు వంద మంది కార్యకర్తలు ఒక్కసారిగా జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.45లో ఉన్న బాలకృష్ణ నివాసం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. బాలకృష్ణ డౌన్ డౌన్, ప్రధాని మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ నివాసంలోకి చొరబడేందుకు గేట్లు ఎక్కుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నెల 20న విజయవాడలో జరిగిన ధర్మ పోరాట దీక్ష సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోదీపై చేసిన ఘాటైన విమర్శలకు బిజెపి, బిజేవైఎం తీవ్రంగా స్పందించింది. జాతీయ స్ధాయిలో ఎంతో ప్రతిష్ట కలిగి, దేశాన్ని పరిపాలిస్తున్న మోదీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన కార్యకర్తలను అదుపుచేయడం పోలీసులకు కష్టంగా మారింది. బాలకృష్ణ నివాసాన్ని ముట్టడించేందుకు వస్తున్న సంగతి ముందుగానే సమాచారం ఉండడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ ఎసిపి నేతృత్వంలో కట్టుదిట్టంగా పోలీసులను మోహరింప చేశారు. బాలకృష్ణ నివాసం వద్దే కాకుండా సమీప ప్రాంతాల్లో కూడా ముట్టడికి ముందు తనిఖీలు చేశారు. సరిగ్గా ఆందోళన కారులు ఇంటి గేటు ముందు ఆందోళన చేస్తుండగా, లోపలి నుంచి బయటకు వెళ్లేందుకు బాలకృష్ణ రావడంతో ఒక్కసారిగా కారును అడ్డుకున్నారు. కారులో నుంచి కిందకు దిగి సమాధానం చెప్పాలని కారుకు అడ్డు తగిలారు. పోలీసులు వారిని పక్కకు లాగి వాహనానికి దారి ఇవ్వడంతో బాలకృష్ణ బయటకు వెళ్లిపోయారు. దీంతో కాసేపు బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తంగా మారింది. దొరికిన వారిని దొరికినట్లు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

బాలకృష్ణపై ఓయు పిఎస్‌లో బీజీపీ ఫిర్యాదు
ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలపై బిజెపి ఎమ్మెల్సీ, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎన్.రామచంద్రరావు ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) పోలీస్ స్టేషన్‌లో బాలకృష్ణపై ఫిర్యాదు చేశారు. ప్రధానిపై నేరుగా ఇలాంటి దూషణలు చేయడం దారుణమని, చట్టపరంగా నేరమని వారు ఫిర్యాదులో ప్రస్తావిస్తూ తక్షణమే బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. శాసనసభ్యుడిగా రాజ్యాంగబద్దంగా నడుచుకోవడం, చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉండగా విచక్షణ మరచిపోయి ప్రధానిపై నోటికొచ్చినట్లు మాట్లాడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.