హైదరాబాద్

మంచినీటి పైపులైన్ పనులు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్ 21: మంచినీటి పైపులైన్ పనులను సకాలంలో పూర్తి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అధికారులను, గుత్తేదార్లను ఆదేశించారు.
జీడిమెట్ల డివిజన్ అయోధ్యనగర్‌లో జరుగుతున్న మంచినీటి పైపులైన్ పనులను ఎమ్మెల్యే వివేక్ పరిశీలించారు. వివేక్ మాట్లాడుతూ.. పైపులైన్ పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీజీఎం బాస్కర్, టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ గ్రామంలో నియోజకవర్గానికి చెందిన 32మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10,03,500ల చెక్కులను ఎమ్మెల్యే కేపీ వివేక్ అందజేశారు. వివేక్ మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి భారీగా నిధులను మంజూరు చేస్తున్నారని అన్నారు.
పేదల పక్షపాతిగా కేసీఆర్ నిలబడుతున్నారని, ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు ఖరీదైన వైద్య సేవలు తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా పట్టించుకోరా?
ఉప్పల్, ఏప్రిల్ 21: జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉప్పల్ ఆరో డివిజన్‌లో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. అనుమతి లేకుండా, అనుమతికి విరుద్ధంగా జరుగుతున్న ఇంటి నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి కోట్ల ఆదాయానికి గండి పడుతోంది. వీటిపై చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖిరిని నిరసిస్తూ భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగింది. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించి అనంతరం సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనుమతి లేకుండా బహుళ అంతస్థులతో నిర్మాణాలు చేపట్టినా పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడంలో అంతర్యమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదస్థద స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగకుండా చూడాల్సిన అధికారులు మరీ కోర్టు నుంచి స్టే తెచ్చుకుని నిర్మాణాలు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని బీజేవైఎం జిల్లా కార్యదర్శి రేవెల్లి రాజు హెచ్చరించారు. కార్యక్రమంలో అపర్ణ కుమార్, నవీన్ యాదవ్, సంపత్, సుధాకర్, సుమన్ చారి, పరుశరామ్, గోవింద్ కుమార్ పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
చేవెళ్ల, ఏప్రిల్ 21: వచ్చే ఏన్నికలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలోని సీహెచ్ ఆర్ గార్డెన్‌లో చేవెళ్ల పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ట్లాడుతూ కేంద్రంలో ఏన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి తగ్గిపోయిందన్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షమ పథకాలు దళారుల కాకుండా అర్హులైన లబ్ధిదారులకే అందుతున్నాయని చెప్పారు. ప్రజలంత బీజేపీని పూర్తిగా విశ్వసిస్తున్నారని, ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు మార్చి తమ పథకాలుగా ప్రచారం చేసుకుటుంన్నారని అరోపించారు. 28వ తేదిన తుక్కుగూడలో 30వేల మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు బొక్కనర్సింహ్మరెడ్డి తెలిపారు.
ప్రతి గ్రామం నుంచి ఈ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శేరి నర్సింగ్ రావు, ప్రేమ్‌రాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు అంజనేయులుగౌడ్, కంజర్ల ప్రకాష్, నియోజకరవర్గం కన్వీనర్ జంగారెడ్డి, పార్టీ నాయకులు విఠల్ రెడ్డి, పాండు రెడ్డి, క్యామ పద్మజనాభం ఉన్నారు.