హైదరాబాద్

రైతుబంధుతో చరిత్రలో నిలిచిపోనున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మే 16: రైతుబంధు పథకంతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని దుందిగల్ గ్రామంలో రైతుబంధు కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్, ఎమ్మెల్సీ రాజుల ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి విచ్చేసి మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు సీహెచ్ మల్లారెడ్డితో కలిసి 691మంది రైతులకు 704చెక్కులను, పాస్‌పుస్తకాలను పంపిణీ చేసి రైతులను శాలువాతో సన్మానించారు. గ్రామ సర్పంచ్ కావలి గణేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే రూ.1.50 లక్షలు కుటుంబానికి ఇచ్చే వారని తెలంగాణలో ప్రస్తుతం రైతు ఆత్మహత్య చేసుకుంటే రూ.5 లక్షలను అందజేస్తున్నామని తెలిపారు. రైతుబంధు పథకంతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ్, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సైతం రైతుబంధు పథకాన్ని అభినందిస్తున్నారని, ప్రధాని నరెంద్రమోదీ కూడా ఇచ్చిన డబ్బులను వెనక్కి తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారని, రైతులకు పెట్టుబడిగా ఇచ్చే రూ.8 వేలను తిరిగి తీసుకోవడానికి కాదని, వ్యవసాయం చేసుకోవడానికి తప్ప వెనక్కి తీసుకోవడానికి కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎరువులు సకాలంలో అదలేదని, లాఠీచార్జీలు జరుగుతుండేవని గుర్తుచేశారు. కల్తీ విత్తనాలను విక్రయిస్తే అట్టి వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసి సంవత్సరం వరకు జైలుకు పంపిస్తున్నామని తెలిపారు. 20వ తేదీ నుంచి ప్రజలందరికి ప్రభుత్వ పరంగా కంటి పరీక్షలు చేస్తున్నామని, ఆపరేషన్, కళ్ల అద్దాలను పంపిణీ చేస్తామని అన్నారు. కంటి పరీక్షలను మొదటగా కాంగ్రెస్ నాయకులకే చేయాలని సీఎం కేసీఆర్ సూచించానని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకువచ్చామని దేశంలోనే పంజాగుట్ట పీఎస్ రెండవ స్థానంలో నిలిచిందని అన్నారు. ప్రశాంతత ఉన్నచోటనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి సీడబ్ల్యూసీ చైర్మన్, సభ్యులు దేశంలో ఇలాంటి ప్రాజెక్టును కట్టలేరని ఇది ఓ రికార్డు అని ప్రశంసలు గుప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ రైతులను సంఘటిత పరిచేందు, బలోపేతానికి రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నామని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో స్థలాన్ని చూపిస్తే రైతు వేదిక ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. జనవరి నుంచి భూ మార్పిడి ఆగిందని, నెల రోజుల అనంతరం భూముల అమ్మకాలు, కొనుగోలు జరిగితే ఇంటికే పాస్ పుస్తకాలు వచ్చేలా ఆన్‌లైన్ పద్ధతి వస్తుందని చెప్పారు. దుందిగల్ నెలకొన్న అసైన్డ్, వ్యవసాయ, వక్ఫ్ భూముల సమస్యలను మానవీయ కోణంలో ప్రభుత్వ ఆదేశానుసారం పరిష్కార దిశగా ముందుకు వెళ్తమని అన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌డీవో మధుసూదన్, ఎంపీపీ కవిత, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, తహశీల్దార్ మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ రవిందర్ యాదవ్ పాల్గొన్నారు.
తెలంగాణ పథకాల కాపీతోనే బీజేపీకి వంద సీట్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను కాపీతోనే కర్ణాటక రాష్ట్రంలో బీజేపీకి వంద సీట్లను సంపాదించిందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుందిగల్ గ్రామంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలను కాపీ చేసిన బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిందని, బీజేపీకి 104 సీట్లు వచ్చాయని లేకపోతే 50 సీట్లకు పరిమితమయ్యేదని విమర్శించారు.
రైతు కళ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం
షాద్‌నగర్: అన్నదాతల కళ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో రైతులకు చెక్కులు, పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ రైతుల కళ్లల్లో ఆనందం చూడటం కోసమే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయడంతోపాటు పంటల సాగుకోసం పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టులను పూర్తి చేసి త్వరలోనే రైతులకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటికే 80శాతం పనులు పూర్తి చేశారని, మిగిలిన 20శాతం పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందిస్తామని తెలిపారు. రైతుల కష్ట, సుఖాలు తెలిసిన సీఎం కేసీఆర్ అన్నదాతలు అడగకముందే ఎన్నో సబ్సిడీ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పంటల సాగుకోసం రైతుబంధు చెక్కులను అందజేస్తూ రాష్ట్రంలో ఉన్న రైతులందరికి సీఎం కేసీఆర్ ఆత్మబంధువు అయ్యారని వివరించారు. చెక్కుల ద్వారా వచ్చే డబ్బులను రైతులు విత్తనాలు, ఎరువుల కోసం, వ్యవసాయ పెట్టుబడుల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. రైతుబంధు పథకంతో వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే పని లేకుండా పోయిందని అన్నారు. సర్పంచ్ జగదీష్, ఎంపీటీసీ సభ్యురాలు స్వప్న, ఎంపీపీ బుజ్జి నాయక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, మండల పార్టీ అధ్యక్షుడు పీ.వెంకట్‌రాం రెడ్డి, నేతలు సూర్యప్రకాష్, నరేందర్, ఎంఎస్ నటరాజ్, ఏనుగు జనార్ధన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రఘునాథ్ యాదవ్, బి.దేవేందర్ యాదవ్, సత్యనారాయణ, యాదయ్య, అశోక్, రాయికల్ వెంకట్ రెడ్డి, పాపయ్య, లక్ష్మయ్య, మధుసూదన్ పాల్గొన్నారు.
కొత్తూరు: రైతును రాజు చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో రైతులకు పాస్‌పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రైతులకు రుణమాఫీతోపాటు పెట్టుబడి సాయం అందించడం సంతోషకరమని అన్నారు. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు సమస్యలు పట్టించుకొని కొంతమంది నాయకులు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏవరెన్ని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలవైపే ఉంటుందని, వారి అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో సిద్ధాపూర్ సర్పంచ్ నర్సమ్మ, ఎంపీటీసీ సభ్యుడు వడ్డె బాలయ్య, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మెండే కృష్ణ యాదవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఏనుగు జనార్థన్ రెడ్డి, బీ.దేవేందర్ యాదవ్, ఎమ్మె సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు.
కొందుర్గు: రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం కొందుర్గు మండల కేంద్రంలో అన్నదాతలకు రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వైపు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు ఎదురు చూస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రమీలరాణి, ఎంపీడీవో యాదయ్య, జమీల్, శ్రావణ్, మల్లేష్, నేతలు అందెబాబయ్య, నరేందర్, నర్సింలు, మాణెయ్య, భీమారం మాణెయ్య, మాణెమ్మ, రామకృష్ణ, పాపయ్య, ఈశ్వరయ్య గౌడ్, దర్గా రాంచంద్రయ్య, మల్లేష్ గౌడ్, ఆంజనేయులు ప్రవీణ్ పాల్గొన్నారు.
మహేశ్వరం: రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం కందుకూర్ మండలంలో మహ్మద్‌నగర్, సార్లేరావుపల్లి, గూపూర్‌నగర్, మహేశ్వరం మండలంలో మహేశ్వరం, గట్టుపల్లి, నందుపల్లి, నాగారం గ్రామాల్లో రైతుబంధు పథకం కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు, చెక్కులను రైతులకు అందజేశారు. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే తీగల మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్రం లో లేని విధంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు.. రైతులకు పెట్టుబడి కింద రెండు పంటలకు ఎకరానికి 8వేల రూపాయలు ఇస్తున్నాడని నాలుగేళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో సంక్షేమాలు అభివృద్ది కార్యక్రమాలను అమలు పరుస్తుందాని రైతుల రుణమాఫి, 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి రైతులను ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆర్‌డీవో రవీందర్ రెడ్డి, తహశ్లీదారు తెన్మోలి, ఏడీ రుద్రమూర్తి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, హెచ్ చంద్రయ్య, రాఘవేందర్ రెడ్డి, కూన యదయ్య, ఎస్.ఆనందం, మోహన్ రెడ్డి, జే.రమేష్ పాల్గొన్నారు.
బాలాపూర్: రైతుబంధు పథకం దేశంలో ఎక్కడ ఏవరు అమలు చేయనట్టువంటి అద్భుత పథకమని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అభివర్ణించారు. బుధవారం ‘రైతుబంధు’ పథకంలో భాగంగా బాలాపూర్ మండలం మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, లబ్ధిదారులైన రైతులకు వ్యవసాయ పెట్టుబడి సహయ చెక్కులను, పట్టా పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. బాలాపూర్ మండల పరిధిలోని వెంకటపూర్, మల్లాపూర్, రేణుకపూర్ గ్రామాలల్లోని 154 మంది రైతులకు రూ.9 లక్షలకుపైగా విలువగల చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఖరీప్ సీజన్ వచ్చిదంటే పెట్టుబడి లేక రైతులు అందోళన చెందేవారని, ఇప్పుడు వ్యవసాయ పెట్టుబడికి రైతు బంధు పథకం అండగా ఉందని అన్నారు. బడంగ్‌పేట్ మున్సిపాలిటీ చైర్మన్ సామ నర్సింహ గౌడ్, వైస్ చైర్మన్ చిగురింత నర్సింహా రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పెంటరెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోర్ర జగన్‌రెడ్డి (బీజేఆర్), కౌన్సిలర్లు దండు గణేష్ ముదిరాజ్, దశరథ నాయక్ పాల్గొన్నారు.
తలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం దేశానికి తలమానికం లాంటిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం తలకొండపల్లిమండలం చీపూనుంతల్ల గ్రామంల్లో రైతులకు రైతుబంధు పథకంలో భాగంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు, వ్యవసాయానికి పెట్టుబడి అర్థిక సహయ చెక్కులను ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి రైతులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఅర్ రైతు పక్షపతిగా వ్యవహరిస్తు సంక్షేమా అభివృద్దికి పాటుపడుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమా అభివృద్ధికి రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సువర్ణ, తహశీల్దార్ జ్యోత్తి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దశరథ్ నాయక్, ఎంపీపీ లక్ష్మీదేవి రఘు రాములు, నాయకులు జగన్‌రెడ్డి, బులకూమార్, నాగోజీ, ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.
శంషాబాద్: రైతు బంధు పథకం ప్రతి రైతుకు ఓ వరం అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని పాల్మాకుల గ్రామంలో రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు చెక్కుల పంపిణీ చేశారు. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సరిత రవినాయక్, మండల పార్టీ అధ్యక్షుడు కే.చంద్రా రెడ్డి, నాయకులు దూడల వెంకటేష్ గౌడ్, దండు ఇస్తారి, సర్పంచ్ జిట్టి సిద్ధులు, మహేందర్ రెడ్డి, గుడాల కృష్ణగౌడ్ పాల్గొన్నారు.
ఘట్‌కేసర్: రైతు ముఖంలో అనందాన్ని చూడటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఘట్‌కేసర్ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండల పరిధి మాధారం, పడమట సాయిగూడెం గ్రామాలలో బుధవారం జరిగిన రైతుబంధు పథకం చెక్కులు, పట్టాపారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని రైతులకు చెక్కులు, పాసు పుస్తకాలు అందజేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటీ నుంచి అన్ని వర్గాల హర్షించేలా పథకాలు ప్రవేశపెట్టి అమలు పర్చినట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముభారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రెండు పడకల గదుల ఇళ్లు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆడ పడుచులకు అన్నగా, రైతులకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శం అయినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహకారంతో మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శంగా నిలిపినట్లు చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటీ ఎద్దడిని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి, మాజీ చైర్మన్ డొంకెని భిక్షపతి గౌడ్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొంతం అంజీరెడ్డి, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుల కుమార్ పాల్గొన్నారు.
ధారూర్: రాష్ట్రంలో రైతాంగాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకే సీఎం కేసిఆర్ రైతుబందు పథకాన్ని ప్రవేశపెట్టారని చేవెళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ధారూర్ మండల పరిధిలోని జైదుపల్లి, తరిగోపుల, నాగ సమందర్ గ్రామాల్లో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు.