హైదరాబాద్
జోరుగా క్రికెట్ బెట్టింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 31: టి-20 ప్రపంచ కప్లో భాగంగా వెస్ట్ఇండీస్, భారత్ తలపడుతున్న రెండో సెమీస్ మ్యాచ్పై బెట్టింగ్లు జోరుగా సాగాయి. నగరవ్యాప్తంగా 25మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేశారు. నిర్వాహకుల నుంచి సుమారు కోటిన్నర స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఎల్బినగర్, నాగోల్, రాజేంద్రనగర్, అల్వాల్, మేడ్చల్, మాదాపూర్, కూకట్పల్లి, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నగరంలో నిర్వహించిన నాకాబందీలో భారీగా డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.
రాజేంద్రనగర్లో రాజేష్ అనే వ్యక్తి రూ. 80 లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్లో రూ. 30 లక్షలు, మేడ్చల్లో రూ. 3 లక్షలు, అల్వాల్లో 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 25 మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో 30 మందికిపైగా పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.