క్రైమ్/లీగల్

భయబ్రాంతులకు గురి చేసే ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం,జూన్ 27: ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద 12 చాకులు,రెండు సెల్‌ఫోన్‌లు, ఒక మోటర్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్‌లోని రాచకొండ సీపీక్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన అదిల్ బరక్‌బా(22) చంద్రాయణ్ గుట్టకు చెందిన మాజీ రౌడీషీటర్ హబీబ్ సలీం (28)బాలాపూర్ ప్రాంతానికి చెందిన మిజ్జా జాఫర్ (25) పాహడి షరీప్ ప్రాంతానికి చెందిన మహ్మద్ హరీఫ్ (22) బాలాపూర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ (20) కలసి గత కొన్ని రోజుల నుంచి ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ కత్తులు, కటార్లు పెట్టుకుని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు స్థానికులు బాలాపూర్ పోలీసులకు సమాచారం అందజేశారు. రంగంలోకి దిగిన రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు సమాచారం తెలుసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి వద్ద ఉన్న కత్తులను స్వాధీనం చే సుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు.