హైదరాబాద్

సనత్‌నగర్ డివిజన్‌లో రూ.40.42లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ / బేగంపేట, ఏప్రిల్ 4: సనత్‌నగర్ డివిజన్‌లో రూ.40.42లక్షల వ్యయంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. సోమవారం మంత్రి వివిధ శాఖల అధికారులతో కలిసి సనత్‌నగర్ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బాలయ్యనగర్‌లో రూ.3.50 లక్షలతో సీవరేజీ పైప్‌లైన్, రూ.8.40లక్షలతో కురగాయల మార్కెట్ వద్ద గల జిహెచ్‌ఎంసి ప్లేగ్రౌండ్ ఫెన్సింగ్ ఏర్పాటు పనులతో పాటు వివిధ ప్రాంతాల్లో రోడ్లు, వాటర్‌పైప్‌లైన్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రితో పాటు స్థానిక కార్పొరేటర్ లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.