హైదరాబాద్

తొలి జాబితాలో..ముగ్గురు మాజీ మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలోని కొన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎం.అనిల్ కుమార్ యాదవ్, నాంపల్లి నుంచి మహ్మద్ ఫిరోజ్ ఖాన్, గోషామహల్ నుంచి ఎం.ముఖేష్ గౌడ్, చార్మినార్ నుంచి మహ్మద్ గౌస్, చాంద్రాయణగుట్ట నుంచి మిశ్రీ, సికింద్రాబాద్ కంటోనె్మంట్ నుంచి సర్వే సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం నుంచి మాజీ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గౌడ్, పరిగి నుంచి టీ.రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల నుంచి కేఎస్ రత్నం, వికారాబాద్ నుంచి జీ.ప్రసాద్ కుమార్, తాండూరు నుంచి పైలెట్ రోహిత్ రెడ్డికి తొలి జాబితాలో టికెట్లు దక్కాయి.